రేపు నెల్లూరులో సీఎం వైయ‌స్‌ జగన్‌ పర్యటన 

 దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతాప సభలో పాల్గొననున్న సీఎం 

తాడేప‌ల్లి:  ఈ నెల 28వ తేదీ(సోమ‌వారం) ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నెల్లూరు జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఉదయం 10.15 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి, 11.30 గంటలకు నెల్లూరు చేరుకోనున్న సీఎం. గొలగమూడి వీపీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనున్న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతాప సభలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌.

Back to Top