23న శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ పర్యటన

  తాడేప‌ల్లి: ఈ నెల 23న ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప‌ర్య‌టించ‌నున్నారు. వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష (రీ సర్వే) రెండో విడత కార్యక్రమాన్ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఎల్లుండి ప్రారంభించ‌నున్నారు.  23వ తేదీ ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు నరసన్నపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానానికి చేరుకుంటారు. 11.00 – 12.55 వరకు బహిరంగ సభలో సీఎం ప్రసంగం, లబ్ధిదారులకు పత్రాల పంపిణీ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.25 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 

Back to Top