కాసేపట్లో ‘స్పందన’పై సీఎం వీడియో కాన్ఫరెన్స్‌

తాడేపల్లి: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడనున్నారు. ఈ సమీక్షలో.. జగనన్న కాలనీలు, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం, టిడ్కో ఇళ్లు, స్పందన కార్యక్రమానికి వస్తున్న ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు. అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్, గోదాముల నిర్మాణం, స్థల సేకరణపై చర్చించనున్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై సీఎం సమీక్షించనున్నారు. అదే విధంగా ధాన్యం సేకరణపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. 
 

Back to Top