వైయ‌స్ఆర్‌, బూచేప‌ల్లి విగ్ర‌హాల‌ను ఆవిష్క‌రించిన సీఎం

ప్ర‌కాశం: చీమ‌కుర్తి మెయిన్‌రోడ్డులోని బూచేప‌ల్లి క‌ల్యాణ మండ‌పం వ‌ద్ద ఏర్పాటు చేసిన‌ దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి, ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గ మాజీ శాస‌న‌స‌భ్యులు బూచేప‌ల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్ర‌హాల‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా మ‌హానేత వైయ‌స్ఆర్‌, సుబ్బారెడ్డి విగ్ర‌హాల‌కు పూల‌మాల‌లు వేసి ఘ‌న నివాళుల‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం వెంట బూచేప‌ల్లి కుటుంబ స‌భ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. 

Back to Top