సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సూళ్లూరుపేట ప‌ర్య‌ట‌న వాయిదా

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి సూళ్లూరుపేట పర్యటన వాయిదా పడింది. భారీ వ‌ర్షాల కార‌ణంగా సీఎం పర్యటన వాయిదా ప‌డిన‌ట్లు సీఎంవో కార్యాలయం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా నేడు తిరుపతి జిల్లా రాయదరువు వద్దగల మాంబట్టు ఎస్‌ఈజెడ్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణం వద్ద నుంచే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాల్సింది ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా కార్యక్రమాన్ని అధికారులు వాయిదా వేశారు. త్వరలోనే రీ షెడ్యూల్‌ ప్రకటించనున్నారు.

Back to Top