రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
తిరుమలకు బయల్దేరిన సీఎం వైయస్ జగన్
27 Sep 2022 3:04 PM
తాడేపల్లి: శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తిరుమలకు బయల్దేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు బయల్దేరి వెళ్లారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకుంటారు. సాయంత్రం 5.20 గంటలకు తిరుపతి గంగమ్మ తల్లి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత అలిపిరి చేరుకొని తిరుమలకు ఎలక్ట్రిక్ బస్సులను సీఎం ప్రారంభిస్తారు. రాత్రి 7.45 గంటలకు తిరుమలలోని బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి సీఎం వైయస్ జగన్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.