రేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరిక
ఇళ్లు కాదు...ఏకంగా ఊళ్లనే నిర్మిస్తున్నాం
17 Mar 2022 3:57 PM
అసెంబ్లీలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి
పేదలకు 30.76 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం
ఇళ్ల నిర్మాణాలతో 17 వేల జగనన్న కాలనీలు ఏర్పాటవుతున్నాయి
జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.32 వేల కోట్లు ఖర్చు
పేదల ఇళ్లకు తక్కువ ధరకే సిమెంట్, స్టీలు
ఇళ్ల నిర్మాణానికి 20 టన్నుల ఇసుకను ఉచితంగా ఇస్తున్నాం
అమరావతి: ఇవాళ రాష్ట్రంలో ఇళ్లు కాదు.. ఊళ్లు కడుతున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 30.76 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు అందజేశామని తెలిపారు. ఏపీ అసెంబ్లీలో పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణంపై స్వల్ప కాలిక చర్చలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఎమ్మెల్యే గర్వపడేలా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. వివక్ష లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. పేదలకు 30.76 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. తొలి విడతలో 15.60 లక్షల మందికి ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని తెలిపారు. కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. సొంతిల్లు కట్టుకోవాలనేది ప్రతీ ఒక్కరి కల అని సీఎం వైయస్ జగన్ అన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అధికారులు మహాయజ్ఞం చేశారని తెలిపారు. ఇళ్ల పట్టాల కోసం 71,811 ఎకరాల భూమి సేకరించామని తెలిపారు. రూ.25వేల కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం సేకరించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 17 వేల కాలనీలు ఏర్పాటవుతున్నాయని తెలిపారు.
సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే..
- సొంతిల్లు కట్టుకోవాలనేది ప్రతీ ఒక్కరి కల
- పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అధికారులు మహాయజ్ఞం చేశారు
- రాష్ట్రంలో పేదలకు 30.76 లక్షల ఇళ్ల పట్టాలు అందజేశాం
- 71,811 ఎకరాల భూమిని పేదలకు ఇచ్చాం
- రూ.25 వేల కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం సేకరించింది
- ప్రతి మహిళ చేతికి రూ.5 లక్షల వరకు ఆస్తిని ఇచ్చాం
- తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నాం
- వివక్ష లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు
- 30.76 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు అందజేశాం
- ఇళ్ల నిర్మాణాలతో 17 వేల జగనన్న కాలనీలు ఏర్పాటవుతున్నాయి
- తొలి దశలో 10 వేలకు పైగా జగనన్న కాలనీల నిర్మాణం
- ప్రతి కాలనీలో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం
- జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.32 వేల కోట్లు ఖర్చు
- పేదల ఇళ్లకు తక్కువ ధరకే సిమెంట్, స్టీలు
- ఇళ్ల నిర్మాణానికి 20 టన్నుల ఇసుకను ఉచితంగా ఇస్తున్నాం
- వచ్చే డిసెంబర్ నాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం
- ఇళ్ల నిర్మాణాల పర్యవేక్షణకు ప్రతి జిల్లాలో ఒక జాయింట్ కలెక్టర్ను నియమించాం
- ప్రతి గ్రామ పంచాయతీలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ అందుబాటులో ఉన్నారు. ఇంటి నిర్మాణాలను బట్టి దశల వారిగా బిల్లుల చెల్లింపు
- ఈ మహా యజ్ఞానికి ఆటంకం కలిగిచేందుకు టీడీపీ శాయశక్తులా కృషి చేశారు
- ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయితే ఎక్కడ వైయస్ జగన్కు మంచి పేరు వస్తుందని విఫరీతమైన దుర్భుద్ధితో కుట్రలు చేశారు
- విశాఖలో 1.80 లక్షల ఇళ్లకు ఇటీవలే కోర్టు క్లియరెన్స్ఇచ్చింది
- నా సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా టీడీపీ నేతలు అడ్డుకుంటే కోర్టు నుంచి ఆదేశాలు రావడంతో పనులు మొదలయ్యాయి. ఏప్రిల్లో పులివెందులలో ఇళ్ల పట్టాలు, ఇంటి నిర్మాణాలు మొదలవుతాయి
- దేవుడి దయ వల్ల ఎన్ని కష్టాలు ఎదురైనా నిరుపేదలను ఇంటి యజమానులను చేసేందుకు ఈ ప్రభుత్వం గట్టిగా పని చేస్తుంది
- పేదల కళ్లలో కనిపించే ఆనందమే మాకు శక్తినిస్తుంది. మమ్మల్ని నడిపిస్తుంది
- దేవుడి దయ వల్ల పేదలకు ఇంకా గొప్పగా మంచి కార్యక్రమాలు చేసే శక్తి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీఎం వైయస్ జగన్ సెలవు తీసుకున్నారు.