వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
శ్రీకాకుళం జిల్లా రైలు ఘటనపై సీఎం దిగ్భ్రాంతి
12 Apr 2022 9:47 AM
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
తాడేపల్లి: శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువ వద్ద రైలు ఢీకొని పలువురు మరణించిన ఘటనపై సీఎం వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు. ఘటనకు సంబంధించిన ప్రాథమిక వివరాలను అధికారులు సీఎం వైయస్ జగన్కు వివరించారు. విశాఖపట్నం నుంచి గౌహతి వెళ్తున్న రైలు సాంకేతిక లోపంతో నిలిచిపోయిందని, చల్లగాలి కోసం కొంతమంది ప్రయాణికులు కిందకు దిగారని, మరో ట్రాక్పై వెళ్తున్న కోణార్క్ఎక్స్ప్రెస్ వీరిని ఢీకొట్టడంతో కొంతమంది మరణించినట్టుగా ప్రాథమిక సమాచారం వచ్చిందని అధికారులు సీఎంకు వివరించారు. మంచి వైద్య సేవలు అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు అన్నిరకాలుగా సహాయసహకారాలు అందించాలన్నారు.