ఒడిశా కూలీల మృతిపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాల‌కు రూ. 3ల‌క్ష‌ల చొప్పున‌ ప‌రిహారం

తాడేప‌ల్లి: గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన కూలీల మృతిపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మావనతాదృక్పథంతో స్పందించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌.. మృతి చెందిన ఆరుగురు కూలీలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు చొప్పున పరిహారం అందజేయాలని అధికారుల‌ను ఆదేశించారు. బతుకుదెరువు కోసం ఒడిశా నుంచి ఏపీకి వచ్చి అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కూలీలకు మానవతాదృక్పథంతో సాయం అందించాలన్నారు. రొయ్యలచెరువుల యాజమాన్యం నుంచి కూడా మృతుల కుటుంబాలకు తగిన పరిహారం అందేలా చూడాలని అధికారులను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. 

తాజా వీడియోలు

Back to Top