వైద్య, ఆరోగ్యశాఖలో ‘నాడు–నేడు’పై సీఎం సమీక్ష

తాడేపల్లి: వైద్య, ఆరోగ్యశాఖలో ‘నాడు–నేడు’ పనులపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. హెల్త్‌ డిపార్టుమెంట్‌లో నాడు–నేడు కార్యక్రమం కింద జరుగుతున్న అభివృద్ధి పనులపై సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనిల్‌ కుమార్‌ సింఘాల్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

తాజా వీడియోలు

Back to Top