‘స్పందన’పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘స్పందన’ కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం మాట్లాడుతున్నారు. ప‌థ‌కాలు, ప‌నుల తీరుపై కలెక్టర్లు నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ సమీక్షలో ప్రధానంగా ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణాలు, జగనన్న తోడు పథకంపై సమీక్షిస్తున్నారు. స్కూళ్లు, అంగన్‌వాడీలలో నాడు–నేడు పనుల పురోగతిపై చర్చిస్తున్నారు. అదే విధంగా గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేలు, వైయస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్స్‌ నిర్మాణంపై ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. 
 

Back to Top