తాడేపల్లి: గట్టి సంకల్పంతో ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. పేదలకు ఇళ్లు రానివ్వకూడదని నిరంతరం అడ్డంకులు సృష్టిస్తున్నా, పేదవాళ్ల కడుపు కొట్టడానికి అంతమంది ఏకం అవుతున్నారని పేర్కొన్నారు. గురువారం ఇళ్ల నిర్మాణాలపై సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణం ప్రగతిపై వివరాలు అందించిన అధికారులు. – ఇప్పటివరకూ 4,24,220 ఇళ్లు పూర్తయ్యాయని, ఆగస్టు 1 నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తవుతాయని వెల్లడించిన అధికారులు. – రూఫ్ లెవల్, ఆ పైస్థాయిలో నిర్మాణంలో ఉన్న ఇళ్లు 5,68,517 కాగా, వివిధ స్థాయిల్లో 9,56,369 ఇళ్లు ఉన్నాయని తెలిపిన అధికారులు. – ఈ అర్థిక సంవత్సరంలో హౌసింగ్ కోసం రూ.2201 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించిన అధికారులు. – కాలనీలు పూర్తవుతున్నకొద్దీ అన్నిరకాలుగా కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు కావాలన్న సీఎం. – ఇళ్ల నిర్మాణవేగాన్ని ఇదే రీతిలో ముందుకు తీసుకెళ్లాలన్న సీఎం. – కోర్టు కేసులు కారణంగా ఇళ్లస్థలాలు పంపిణీ నిలిచిపోయిన చోట ప్రత్యామ్నాయ భూముల సేకరణపై దృష్టి పెట్టాలని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశం. – విశాఖలో ఇళ్ల నిర్మాణం నిర్దేశిత సమయంలోగా పూర్తికావాలని, ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం. –వీలైనంత త్వరగా అక్కడ పేదలకు నివాసం కల్పించడానికి ∙చర్యలు వేగవంతం చేయాలన్న సీఎం. – డిసెంబరులోగా విశాఖలో ఇళ్లు పూర్తిచేయడానికి తగిన కార్యచరణ రూపొందించాలని, ఏం కావాలన్నా వెంటనే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించిన సీఎం. – కొత్తగా ఇళ్లకోసం దరఖాస్తు చేసుకున్నవారికి పట్టాలు ఇచ్చేందుకు భూములను సేకరించాలని ఆదేశించిన సీఎం. – దీనిపై కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్న సీఎం. – వీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశం. – సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల నిర్మాణం పనులు, దీనికి సంబంధించిన అంశాలను సీఎంకు తెలిపిన అధికారులు. – 45,101 మంది ఆప్షన్–3 ఎంపిక చేసుకున్నారని తెలిపిన అధికారులు. – ఇప్పటికే కాంట్రాక్టర్ల ఎంపిక కూడా పూర్తయిందని తెలిపిన అధికారులు. – అందరితోనూ బ్యాంకు ఖాతాలు తెరిచే ప్రక్రియ ప్రారంభమైందని తెలిపిన అధికారులు. – నీటి సరఫరా, అప్రోచ్ రోడ్లు, విద్యుత్ సరఫరా తదితర పనులపై దృష్టిపెట్టామని తెలిపిన అధికారులు. – సీఆర్డీఏ ప్రాంతంలో పేదలకు ఇళ్ల నిర్మాణంపై పిటిషన్లు, కోర్టు విచారణలో అంశాన్ని ప్రస్తావించిన అధికారులు. – పేదలకు ఇళ్లు రానివ్వకూడదని నిరంతరం అడ్డంకులు సృష్టిస్తున్నారు: సీఎం. – పేదవాళ్ల కడుపు కొట్టడానికి అంతమంది ఏకం అవుతున్నారు: సీఎం – పేదలకు ఇళ్లు రాకూడదన్నది వారి ఆలోచన: సీఎం. – గట్టి సంకల్పంతో ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలి: సీఎం – దీనికోసం న్యాయపరమైన చర్యలన్నీ తీసుకోవాలి: సీఎం టిడ్కో ఇళ్లపైనా సీఎం సమీక్ష. – ఇప్పటివరకూ 71,452 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించిన ప్రభుత్వం. – ఈనెలలో మరో 29,496 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించనున్న ప్రభుత్వం. – ఆగస్టులో 49,604 ఇళ్లు ఇస్తామన్న అధికారులు. – 300 చదరపు అడుగులు ప్లాట్లను ఉచితంగా ప్రభుత్వం ఇస్తున్నందున మిగిలిన కేటగిరీల్లోని (365, 430 చ.అ) లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా దాదాపు రూ.2వేల కోట్లు రుణాలుగా ఇప్పించామన్న అధికారులు. – టిడ్కో గృహ సముదాయాలను స్వయం సమృద్ధి దిశగా నడిపించాలని సీఎం ఆదేశం. – దీనికి సంబంధించి వివిధ ప్రతిపాదనలను పరిశీలించిన సీఎం. – వందల, వేల సంఖ్యలో గృహాలు ఈ కాలనీల్లో ఉంటున్నందున వారి అవసరాలను తీర్చేలా వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేసేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్. – తొలిదశలో 15 టిడ్కో కాలనీల్లో ఇవి ఏర్పాటు. – మహిళల ఆధ్వర్యంలో వ్యాపార, వాణిజ్య సముదాయాలు ఏర్పాటు అయ్యేలా చూడాలన్న సీఎం. – దీనివల్ల అందుబాటు ధరలతో సరుకులు అక్కడి పేదలకూ అందుతాయని, అలాగే మహిళలకూ ఉపయోగం ఉంటుందన్న సీఎం. – అలాగే టిడ్కో గృహాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకూ సీఎం గ్రీన్ సిగ్నల్.