దిశ ప్రాజెక్టుపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: రాష్ట్రంలోని మ‌హిళ‌లు, యువ‌తుల భ‌ద్ర‌త కోసం ఏర్పాటు చేసిన‌ దిశ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. దిశ యాప్‌పై రాష్ట్ర వ్యాప్తంగా జ‌రుగుతున్న అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు, యాప్ డౌన్‌లోడ్స్ ప్ర‌క్రియ త‌దిత‌ర అంశాల‌పై మంత్రులు, ఉన్న‌తాధికారుల‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చ‌ర్చిస్తున్నారు. 

Back to Top