ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సన్నద్ధం కండి
30 Jul 2021 5:29 PM
పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై సీఎం వైయస్.జగన్ సమీక్ష
వ్యర్ధాల(చెత్త) సేకరణకు 4868 వాహనాలు
72 పట్టణాల్లో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు
పులివెందులలో మహిళా మార్ట్ నిర్వహణపై సీఎం అభినందనలు
తాడేపల్లి: గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సన్నద్ధం కావాలని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రతి 2వేల జనాభాకు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసు వస్తుందని సీఎం పేర్కొన్నారు. ప్రజలకు అత్యంత చేరువలో రిజిస్ట్రేషన్ సేవలు లభిస్తాయని చెప్పారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు.
క్లీన్ ఆంధ్రప్రదేశ్ ‘క్లాప్’ కార్యక్రమంపైనా సీఎంకు అధికారులు వివరాలు తెలియజేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 124 మున్సిపాల్టీలు, నగరపాలక సంస్థల్లో 1.2 కోట్ల బిన్లు ఏర్పాటు చేస్తున్నామని, 40 లక్షల ఇళ్ళకు ఇంటికి మూడు చొప్పున బిన్లు ఇస్తున్నామని తెలిపారు. ఇవి గ్రీన్, బ్లూ, రెడ్ కలర్స్లో ఉంటాయని చెప్పారు. వ్యర్ధాల(చెత్త) సేకరణకు 4868 వాహనాలు కొనుగోలు చేస్తున్నామని, ఇందులో 1771 ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయన్నారు. మొదటి ఫేజ్లో 3097 వాహనాలు, 225 గార్బేజ్ ట్రాన్స్పోర్ట్ స్టేషన్లు
సేకరించిన వ్యర్ధాలను వివిధ విధానాల్లో ట్రీట్చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సేకరించిన వ్యర్ధాల్లో 55 నుంచి 60 శాతం వరకూ తడిచెత్త ఉంటుందని చెప్పారు. దీన్ని బయోడీగ్రేడ్ విధానంలో ట్రీట్చేస్తారని వివరించారు. 35 నుంచి 38 శాతం వరకూ పొడిచెత్త రూపంలో ఉన్న దాన్ని రీసైకిల్ చేస్తారని, మరికొంత మొత్తాన్ని సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలిస్తారని, ఇంకా 10–12 శాతం ఇసుక తదితర రూపంలో ఉంటుందని.. దీన్ని ఫిల్లింగ్కు వాడుతారని సీఎం వైయస్ జగన్కు అధికారులు వివరించారు.
72 పట్టణాల్లో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆగస్టు 15 కల్లా టెండర్ల ప్రక్రియ పూర్తి అవుతుందని, జులై 2022 కల్లా ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించామని అధికారులు తెలిపారు.
రోడ్ల మరమ్మతులకు చర్యలు తీసుకోండి
మున్సిపాల్టీలు, నగరాల్లో రోడ్ల మరమ్మతులకు అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. రోడ్లు భవనాల శాఖతో సమన్వయం చేసుకుని కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. పట్టణాలు, నగరాలను పరిశుభ్రంగా ఉంచాలని, రోడ్ల మరమ్మతును ప్రాధాన్యతగా చేపట్టాలని సూచించారు. వర్షాకాలం ముగియగానే రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.
పట్టణాలు, నగరాల్లో కనస్ట్రక్షన్, డిమాలిషన్ వేస్ట్ మేనేజ్మెంట్పై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. విశాఖ, విజయవాడ, తిరుపతిల్లో ఇప్పటికే ప్లాంట్లు ఉన్నాయని సీఎంకు అధికారులు తెలిపారు. రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురంల్లో కూడా ఇలాంటి ప్రాజెక్టులు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు.
ప్రజలకు అత్యంత చేరువలో రిజిస్ట్రేషన్ సేవలు
గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సన్నద్ధం కావాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీనివల్ల ప్రతి 2వేల జనాభాకు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసు వస్తుందని చెప్పారు. ప్రజలకు అత్యంత చేరువలో సేవలు లభిస్తాయని తెలిపారు. దీంతోపాటు.. ఆ గ్రామ, వార్డు సచివాలయాల్లో పరిధిలో భూములపై తగిన పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు. దీనివల్ల ఆక్రమణలు, అన్యాక్రాంతాలకు ఆస్కారం ఉండదని సీఎం వైయస్ జగన్ తెలిపారు.
90 రోజుల్లో ఇళ్ల స్థలాలు మంజూరు
అర్హులైన పేదలందరికీ కూడా 90 రోజుల్లో ఇంటి స్థలాలను ప్రభుత్వం మంజూరు చేస్తుందని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పేద కుటుంబాలు ఇంటి స్థలం కోసం మధ్యవర్తులతో పాటు, ఇతరులమీదో, ఇతర మార్గాలమీద ఆధారపడాల్సిన అవసరంలేని పరిస్థితిని తీసుకొచ్చామన్నారు. ఉల్లంఘనలు, ఆక్రమిత ప్రాంతాల్లో కనీస సదుపాయాలులేని పరిస్థితి ఉండకూడదనే భారీ ఎత్తున 30 లక్షలకుపైగా ఇళ్లస్థలాలు మంజూరు చేశామని స్పష్టం చేశారు. దీంతో పాటు, 15 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాన్ని ప్రాంరభించామని చెప్పారు. దీనికోసం పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నామని చెప్పారు.
అర్హులైన వారు రాజమార్గంలో పట్టా తీసుకునే పరిస్థితిని మనం సృష్టించామన్నారు. ఇకపై అక్రమ ప్రాంతాల్లో, ఆక్రమిత ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకునే వారిని నెట్టివేసే పరిస్థితులను పూర్తిగా తీసివేశామన్నారు. పేదవాడికి ఇంటి స్థలం లేదని మన దగ్గరకు వచ్చినప్పుడు అర్హుడైతే 90 రోజుల్లోగా వెంటనే ఇంటిపట్టాను మంజూరుచేసే కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు.
విశాఖపట్నంలో చేపట్టనున్న పలు అభివృద్ధి ప్రాజెక్టులపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. బీచ్కారిడార్, మల్టీలెవర్ కార్పార్కింగ్, నేచురల్ హిస్టరీ పార్క్, మ్యూజియం, బీచ్ కారిడార్ ప్రాజెక్టులపై సీఎం ఆరా తీశారు.
టిడ్కో ఇళ్ల నిర్మాణాలు, కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. నిర్దేశించుకున్న షెడ్యూలు ప్రకారం టిడ్కోఇళ్లు పూర్తికావాలని సీఎం ఆదేశించారు. మౌలిక సదుపాయాల కల్పనపైనా దృష్టిపెట్టాలని సూచించారు. మొదటివిడతలో భాగంగా చేపట్టిన 38 లొకేషన్లలో 85,888 ఇళ్లలో సుమారు 45వేలకుపైగా ఇళ్లు మూడు నెలల్లోగా, మిగిలిన ఇళ్లు డిసెంబర్లోగా అప్పగిస్తామని అధికారులు సీఎం వైయస్ జగన్కు వివరించారు. లబ్ధిదారులకు ఇళ్లుఅప్పగించేటప్పుడు పూర్తిగా అన్నిరకాల వసతులతో ఇవ్వాలని సూచించారు. మౌలికసదుసాయాలు విషయంలో రాజీ పడొద్దని చెప్పారు.
వైయస్సార్ అర్బన్క్లినిక్స్ నిర్మాణంపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. విజయవాడ, గుంటూరు, నెల్లూరుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తిచేయడానికి కార్యాచరణ సిద్ధంచేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వం హయాంలో ఈ ప్రాజెక్టులను అసంపూర్తిగా విడిచిపెట్టారని సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. మూడు ప్రాంతాల్లో ట్రీట్మెంట్ప్లాంట్లకు పొల్యూషన్ కంట్రోల్బోర్డు సిఫార్సులు లేకపోతే నదులు కలుషితం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మూడు చోట్ల వెంటనే ట్రీట్ మెంట్ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
మంగళగిరి – తాడేపల్లి, మాచర్ల, కర్నూలులో ట్రీట్మెంట్ప్లాంట్ల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
పులివెందులలో పైలట్ ప్రాజెక్టుగా మహిళా మార్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు సీఎం వైయస్ జగన్కు వివరించారు. మహిళా మార్ట్ నిర్వహణపై సీఎం అభినందనలు తెలిపారు. మహిళా సంఘాల సహాయంతో మార్ట్ నిర్వహణ బాగుందని ప్రశంసించారు. మార్ట్లో మహిళలను భాగస్వాములుగా చేయడం బాగుందని సీఎం అభినందించారు. తక్కువ ధరలకూ వారికి అందుబాటులో సరుకులు అందడం బాగుందన్నారు. ఒక్కో మహిళ నుంచి రూ.150ల చొప్పున 8వేలమంది మహిళా సంఘాల సభ్యులనుంచి సేకరించి, ఆ డబ్బుతో మార్టు పెట్టామన్న అధికారులు. మెప్మా దీనిపై పర్యవేక్షణ చేస్తుందని చెప్పారు. మెప్మా ఉత్పత్తులు కూడా ఈ మార్ట్లో ఉంచామని అధికారులు తెలిపారు.మార్ట్ నిర్వహణ పనితీరుపై నిశిత పరిశీలన చేసి... మిగతాచోట్ల కూడా అలాంటి ప్రయత్నాలు చేయాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధి స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, ఏఎంఆర్డీఏ కమిషనర్ పి లక్ష్మీ నరసింహం, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి వి రామ మనోహరరావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఎం ఎం నాయక్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.