అమరావతి అభివృద్ధిపై సీఎం సమీక్ష ప్రారంభం

తాడేపల్లి: అమరావతి మెట్రో పాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఏఎంఆర్‌డీఏ) అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న సమీక్షా సమావేశానికి మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అమరావతిలో ప్రస్తుతం ఉన్న భవనాల నిర్మాణం, వాటి పురోగతి, అమరావతి అభివృద్ధి తదితర అంశాలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షిస్తున్నారు.

 

తాజా వీడియోలు

Back to Top