ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మ
ఉద్యాన రంగంలో రైతులు ఆదాయాన్ని పెంచే వ్యూహాలు
14 Aug 2021 9:22 AM
హార్టికల్చర్, సెరికల్చర్ , వ్యవసాయ అనుబంధశాఖలపై సీఎం వైయస్.జగన్ సమీక్ష
తాడేపల్లి: ఉద్యాన రంగంలో రైతులు ఆదాయాన్ని పెంచే వ్యూహాలను అమలు చేయాలని సీఎం శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని రైతులకు అందించడం కోసం జాతీయంగా, అంతర్జాతీయంగా నైపుణ్య సంస్ధలు, యూనివర్సిటీల సహకారం తీసుకోవాలని సూచించారు. నిరంతర పరిశోధనలు, పరస్పర సమాచార మార్పిడి ద్వారా అధ్యయనం, ప్రయోగాలు కొనసాగాలన్నారు. ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త వంగడాలు, సాగులో సమస్యల పరిష్కారం, ఫుడ్ప్రాససింగ్ రంగంలో కొత్త టెక్నాలజీ, ప్రాససింగ్కు అనుకూలమైన రకాల సాగే లక్ష్యంగా ఈ పరిశోధనలు ఉండాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో హార్టికల్చర్, సెరికల్చర్ , వ్యవసాయ అనుబంధశాఖలపై సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలు ఇలా..
కర్నూలు జిల్లాలో మంచి మార్కెట్ అవకాశాలున్న ఉల్లి సాగుపై ఫోకస్ పెట్టండి: అధికారులకు సీఎం శ్రీ వైయస్.జగన్ ఆదేశం
నాణ్యమైన మంచి రకం ఉల్లి సాగయ్యేలా చూడండి:
ఫుడ్ ప్రాససింగ్కు అనుకూలంగా ఉన్న వెరైటీలు సాగయ్యేలా చూడాలి: అధికారులకు సీఎం ఆదేశం
టమోటను రోడ్డుమీద వేయడం, ధరలేక పొలంలోనే రైతులు ఉల్లిపంటను వదిలేసే పరిస్ధితి కనిపించకూడదు:
దీనికోసం సరైన పరిష్కారాలను చూపాలి: అధికారులకు సీఎం ఆదేశం
ఉద్యానపంటల్లో గరిష్ట సాగుతో ఏపీ ప్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరుపొందిందని సీఎంకు తెలిపిన అధికారులు
కొబ్బరి, అరటి, బొప్పాయి, మిరప, టమోట, ఉల్లి, బత్తాయి పంటల సాగుపై సీఎంకు వివరాలందించిన అధికారులు
వీటి సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలన్న సీఎం
కొబ్బరి, బొప్పాయి, టమోట సాగులోనూ, ఉత్పాదకతలోనూ దేశంలోనే ఏపీ ప్రథమ స్ధానంలోనే నిల్చిందన్న అధికారులు
టిష్యూ కల్చర్ విధానంలో అరటిసాగు చేపడుతున్నామన్న అధికారులు
పుడ్ ప్రాససింగ్లో భాగంగా 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో వివిధ వ్యవసాయ ఉత్పత్తుల ప్రాససింగ్ యూనిట్ల నిర్మాణ పనులు మొదలు కావాలని సీఎం ఆదేశం
అక్టోబరు నుంచి దశలవారీగా నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపిన అధికారులు
మిరపసాగు విస్తీర్ణం పెంచడంతో పాటు ప్రాససింగ్పైనా మరింత ధ్యాసపెట్టాలన్న సీఎం
దీనికోసం అంతర్జాతీయ సంస్ధల సహకారం తీసుకోవాలన్న సీఎం
కొబ్బరికి కూడా మంచి ధర వచ్చేలా చూడాలని సీఎం ఆదేశం
కొబ్బరిమీద నిరంతరం పరిశోధనలు చేయాలని హార్టికల్చర్ విశ్వవిద్యాలయం వీసీకి సీఎం ఆదేశం
కొబ్బరిసాగులో ఎదురవుతున్న సమస్యలమీద నిరంతరం పరిశోధనలు కొనసాగాలి:
అవసరమైతే అత్యుత్తమ సంస్థల సహకారం కూడా తీసుకోవాలని సీఎం ఆదేశం
జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో సహకారం, సమాచార మార్పిడి నిరంతరం కొనసాగాలన్న సీఎం
పరస్పర సమాచార మార్పిడి వల్ల చక్కటి పరిశోధనలు జరుగుతాయన్న సీఎం
వారి పరిశోధనల వివరాలను కూడా తీసుకుని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి
దీనివల్ల మంచి వంగడాలను పెట్టడంతోపాటు సాగులో వస్తున్న సమస్యలకు మంచి పరిష్కారాలు లభిస్తాయి: సీఎం
వీటితోపాటు ప్రాససింగ్ రంగంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానంపైనా ఎప్పటికప్పుడు అధ్యయనాలు జరగాలన్న సీఎం
వీటికి అనుగుణంగా సాగులో మార్పులు, అనుకూలమైన వంగడాలను సాగుచేసేలా తగిన చర్యలు తీసుకునే అవకాశం లభిస్తుందన్న సీఎం
రైతుభరోసా కేంద్రాలకు వచ్చినప్పుడు రైతులు వ్యక్తంచేస్తున్న సందేహాలను నివృత్తి చేసేలా వ్యవస్థ ఉండాలి: సీఎం
ఆర్బీకేల్లో ఉండే అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఆ సందేహాలను తీర్చేలా ఉండాలన్న సీఎం
దీనివల్ల రైతులకు, అగ్రికల్చర్ అసిస్టెంట్లకు మధ్య మంచి వాతావరణం ఉంటుందని, అనుకున్న ఫలితాలను సాధించగలుగుతామన్న సీఎం
రైతులు వ్యక్తంచేసిన సందేహాలను, సమస్యలను పరిష్కరించే దిశగా అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రయత్నించాలన్న సీఎం
ఆర్బీకేలను తనిఖీ చేసినప్పుడు రైతులు వెల్లడించిన సమస్యలు, సందేహాలు ఎన్ని? వాటికి ఎలాంటి పరిష్కారం చూపారన్న అంశాన్నికూడా కచ్చితంగా పరిశీలించాలన్న సీఎం
రైతులకు అత్యంత వేగంగా పరిష్కారాలు చూపే విధంగా ఎస్ఓపీ ఉండాలన్న సీఎం
ఈ విషయంలో జవాబుదారీతనం ఉండాలన్న సీఎం
అగ్రికల్చర్ విద్యార్థులు తప్పనిసరిగా ఆర్బీకేల్లో కనీసం నెలరోజులపాటు పనిచేసేలా నిబంధన పెట్టాలన్న సీఎం
దీనివల్ల వాటి పనితీరు, కార్యక్రమాలపై వారికి అవగాహన, పరిజ్ఞానం వస్తాయన్న సీఎం
అధిక ఆదాయాన్నిచ్చే పంటల సాగువైపు రైతులను ప్రోత్సిహించాలని అధికారులకు సీఎం నిర్దేశం
బోర్లు కింద వరిసాగు, సుబాబుల్, పొగాకు, చెరకు, మొక్కజొన్న వంటి పంటల సాగుని క్రమంగా తగ్గించి, ఉద్యానపంటలసాగు వైపు మొగ్గుచూపేలా రైతులను మోటివేట్ చేస్తున్నామన్న అధికారులు
2020–21లో ఈ విధంగా 1 లక్షా 42వేల 565 ఎకరాల్లో అదనంగా ఉద్యానపంటలు సాగు చేపట్టినట్లు వివరాలందించిన అధికారులు
ఈ యేడాది 1,51,742 ఎకరాల్లో ఉద్యాన పంటల అదనపు సాగు లక్ష్యం నిర్దేశించుకున్నామన్న అధికారులు
రైతుల సందేహాలకు ఇస్తున్న సలహాలు, పరిష్కారాలను వీడియో రికార్డ్చేయాలని వీటిని డిజిటల్ ఫ్లాట్ఫాం మీదకు తీసుకు రావాలన్న సీఎం
వీటిని అప్లోడ్ చేయడం ద్వారా మిగిలిన రైతుల సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుందన్న సీఎం
దీనికోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ను వాడుకోవాలన్న సీఎం
మార్కెటింగ్ చేయగలిగే అవకాశం ఉన్న ప్రతి వంగడాన్ని కూడా రైతుల్లోకి విరివిగా తీసుకెళ్లొచ్చన్న సీఎం
రైతులు కష్టపడి సాగుచేసిన తర్వాత వాటిని మార్కెటింగ్ చేయడంకోసం మళ్లీ కష్టపడే పరిస్థితి రాకూడదన్న సీఎం
పువ్వుల (ప్లోరీకల్చర్) రైతుల విషయంలో సరైన మార్కెటింగ్ అవకాశాలు, వాటి ప్రాససింగ్పైనా దృష్టిపెట్టాలన్న సీఎం
*ఏపీఎంఐపీ పైనా సీఎం సమీక్ష*
తుంపరసేద్యం, బిందుసేద్యం పరికరాల మంజూరులో పారదర్శకతకు పెద్దపీట వేయాలన్న సీఎం
ఆర్బీకేల ద్వారా లబ్ధిదారుల ఎంపిక ఉండాలన్న సీఎం
రివర్స్ టెండరింగ్కు వెల్లడం ద్వారా కూడా రేట్లు గణనీయంగా తగ్గుతాయన్న సీఎం
నాణ్యమైన పరికరాలు మంచి రేట్లకు ప్రభుత్వానికి, రైతులకు అందుబాటులోకి వస్తాయన్న సీఎం
అవినీతికి తావులేని విధానంలో రైతులకు పరికరాలు అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం
సెరికల్చర్ సాగు– ప్రోత్సాహం
సెరికల్చర్ సాగు విధానం, ఉత్పాదకతపై సీఎంకు వివరాలందించిన అధికారులు
పట్టుగూళ్ల విక్రయాల్లో ఇ– ఆక్షన్ విధానం తీసుకొచ్చామని తెలిపిన అధికారులు
దీనివల్ల దేశవ్యాప్తంగా వ్యాపారులు కొనుగోలుచేస్తున్నారని, రైతులకు ధరలు వస్తున్నాయని తెలిపిన అధికారులు
1250కి పైగా ఆర్బీకేల పరిధిలో పట్టుపురుగులు పెంచుతున్న రైతులు ఉన్నారన్న అధికారులు
వీటిపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం
సెరికల్చర్ సాగు ప్రోత్సాహకానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్న సీఎం
రైతులకు షెడ్ల నిర్మాణంపై దృష్టిపెట్టాలన్న సీఎం
తద్వారా చిన్న రైతులను సెరికల్చర్ సాగులో ప్రోత్సహించినట్టవుతుందన్న సీఎం
ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాససింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ, సహాకార, పశుసంవర్ధక, పాడిపరిశ్రామభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, హార్చికల్చర్ కమిషనర్ ఎస్ ఎస్ శ్రీధర్, ఏపీ విత్తనాభివృద్ధి సంస్ధ వీసీ అండ్ ఎండీ డాక్టర్ జి శేఖర్ బాబు, ఏపీ పుడ్ ప్రాససింగ్ సొసైటీ సీఈఓ ఎల్ శ్రీధర్రెడ్డి, ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పీఓ డాక్టర్ హరినాథ్ రెడ్డి, వైయస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ టి జానకిరామ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.