కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
ప్రతి గ్రామంలోనూ డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు
03 Aug 2021 4:12 PM
ఐటీ, డిజిటల్ లైబ్రరీలపై సీఎం వైయస్.జగన్ సమీక్ష
వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్ను బలోపేతం చేసే దిశగా చర్యలు
గ్రామ సచివాలయాలకు, రైతు భరోసా కేంద్రాలకూ ఇంటర్నెట్ కనెక్షన్
తాడేపల్లి: ప్రతి గ్రామ పంచాయతీలోనూ డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేయాలని సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ డిజిటల్ లైబ్రరీలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ మాట్లాడుతూ..వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్ను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
గ్రామాలకు మంచి సామర్ధ్యం ఉన్న ఇంటర్నెట్ను తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్తోపాటు గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కు ఉపయోగకరంగా డిజిటల్ లైబ్రరీలు ఉండాలన్నారు. డిజిటల్ లైబ్రరీల్లో కామన్ ఎంట్రెన్స్ టెస్టులతో పాటు అన్ని రకాల పోటీ పరీక్షలకు అందుబాటులో స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంటుందన్నారు.
గ్రామ సచివాలయాలకు, రైతు భరోసా కేంద్రాలకూ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. నిరంతర ఇంటర్నెట్ కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలోనూ డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వైయస్.జగన్ పేర్కొన్నారు.
అక్కడ నుంచే పని చేసుకునే సదుపాయం ఉంటుందని తెలిపారు. మొదటి విడతలో 4530 డిజిటల్ లైబ్రరీల నిర్మాణం చేపడుతామని, ఆగస్టు 15న పనులు మొదలుపెట్టేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆలోగా స్థలాలు గుర్తించి హేండ్ ఓవర్ చేయాలని సీఎం ఆదేశించారు.
అదే సమయంలో డిసెంబర్ కల్లా డిజిటల్ లైబ్రరీల పనులు పూర్తయ్యేలా ప్రణాళిక వేసుకున్నామని అధికారులు సీఎం వైయస్ జగన్కు వివరించారు.
డిజిటల్ లైబ్రరీలు– హై క్వాలిటీ ఇంటర్నెట్
డిజిటల్ లైబ్రరీ బిల్డింగులో కనీస సదుపాయాలతో పాటు మూడు డెస్క్టాపులు, యూపీఎస్, డెస్క్టాప్ బార్కోడ్ ప్రింటర్, స్కానర్, లేజర్ ప్రింటర్, సాఫ్ట్వేర్, యాంటీ వైరస్ సాఫ్ట్వేర్, అన్లిమిలెడ్ బ్యాండ్విడ్త్ ఇంటర్నెట్ స్టోరేజీకి సంబంధించి డేటా సెంటర్ల నిర్మాణం పూర్తి చేసి అందుబాటులో తీసుకురావాలని సీఎం ఆదేశించారు. మౌలిక సదుపాయాల్లో భాగంగా 3 డెస్క్టాప్ టేబుల్స్, సిస్టం చెయిర్స్, విజిటర్ చెయిర్స్, ట్యూబులైట్స్, ఫ్యాన్లు, ఐరన్ రేక్స్, వార్తాపత్రికలు, మేగజైన్స్ డిజిటల్ లైబ్రరీల్లో ఏర్పాటు చేసుకోవాలన్నారు. తొలివిడతలో భాగంగా 4530 డిజిటల్ లైబ్రరీల్లో కనీస సదుపాయాలు, కంప్యూటర్ పరికరాలకోసం దాదాపుగా రూ.140 కోట్లకుపైగా ప్రభుత్వం ఖర్చుచేయనున్నట్లు సీఎం వైయస్ జగన్ పేర్కొన్నారు.
ఈ సమీక్షా సమావేశానికి పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ గిరిజా శంకర్, ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ ఎం మధుసూధన్రెడ్డి, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఎండీ ఎం నంద కిషోర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.