తాడేపల్లి: విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలోని ఏయూ గ్రౌండ్స్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సును ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.పారిశ్రామిక రంగానికి రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, సానుకూలతలను ఈ సదస్సు వేదికగా వివరించనున్న ప్రభుత్వం. తద్వారా పెట్టుబడుల ఆకర్షణకు ఈ సదస్సును వేదిక చేసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం. - కార్యక్రమాల షెడ్యూల్ను సీఎంకు వివరించిన అధికారులు. - వేదిక వద్ద జరుగుతున్న పనులు తదితర అంశాలను వివరించిన అధికారులు. - ఈ సదస్సుకు వస్తున్న కేంద్రమంత్రులు, వ్యాపారవేత్తలు తదితర వివరాలను సీఎంకు తెలియజేసిన అధికారులు. - సదస్సు నిర్వహణలో కొన్ని సూచనలు చేసిన ముఖ్యమంత్రి. - ఉదయం అల్పాహారంతో తొలిరోజు కార్యక్రమం ప్రారంభం. - 10 గంటల ప్రాంతంలో ప్రారంభం కానున్న సదస్సు. - కీలక అంశాలపై సదస్సునుద్దేశించి మాట్లాడనున్న పారిశ్రామిక దిగ్గజాలు, వ్యాపారవేత్తలు. - తర్వాత కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు. - దీనితర్వాత వివిధ పారిశ్రామిక రంగాలపై సెషన్లు. - వ్యాపారవేత్తలతో ముఖాముఖి చర్చలు జరపనున్న సీఎం. - సదస్సు ప్రాంగణంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు. - తొలిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమం. - తొలిరోజు రాత్రి సభకు హాజరైన వారికి విందు, విందులో పాల్గోనున్న ముఖ్యమంత్రి. - రెండోరోజున వాలెడిక్టరీ సెషన్. - ఈ సెషన్లో పాల్గోనున్న పలువురు ప్రముఖులు. - రెండోరోజునా పలు కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు. - ముఖ్యమంత్రి చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుని మొత్తంగా షెడ్యూల్ ఖరారు చేసే పనిలో అధికారులు. ఈ సమావేశంలో పాల్గొన్న పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, సమాచారశాఖ కమిషనర్ టి విజయ్కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు.