గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు ఏర్పాట్లపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష

తాడేప‌ల్లి: విశాఖపట్నంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లపై క్యాంపు కార్యాలయంలో సీఎం  వైయస్‌.జగన్‌ సమీక్ష స‌మావేశం నిర్వహించారు.  మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలోని ఏయూ గ్రౌండ్స్‌లో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సును ఏపీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది.పారిశ్రామిక రంగానికి రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, సానుకూలతలను ఈ సదస్సు వేదికగా వివరించనున్న ప్రభుత్వం. తద్వారా పెట్టుబడుల ఆకర్షణకు ఈ సదస్సును వేదిక చేసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం.
-    కార్యక్రమాల షెడ్యూల్‌ను సీఎంకు వివరించిన అధికారులు.
-    వేదిక వద్ద జరుగుతున్న పనులు తదితర అంశాలను వివరించిన అధికారులు.
-    ఈ సదస్సుకు వస్తున్న కేంద్రమంత్రులు, వ్యాపారవేత్తలు తదితర వివరాలను సీఎంకు తెలియజేసిన అధికారులు.
-    సదస్సు నిర్వహణలో కొన్ని సూచనలు చేసిన ముఖ్యమంత్రి. 
-    ఉదయం అల్పాహారంతో తొలిరోజు కార్యక్రమం ప్రారంభం.
-    10 గంటల ప్రాంతంలో ప్రారంభం కానున్న సదస్సు.
-    కీలక అంశాలపై సదస్సునుద్దేశించి మాట్లాడనున్న పారిశ్రామిక దిగ్గజాలు, వ్యాపారవేత్తలు.
-    తర్వాత కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు.
-    దీనితర్వాత వివిధ పారిశ్రామిక రంగాలపై సెషన్లు.
-    వ్యాపారవేత్తలతో ముఖాముఖి చర్చలు జరపనున్న సీఎం.
-    సదస్సు ప్రాంగణంలో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు.
-    తొలిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమం. 
-    తొలిరోజు రాత్రి సభకు హాజరైన వారికి విందు, విందులో పాల్గోనున్న ముఖ్యమంత్రి.
 
-    రెండోరోజున వాలెడిక్టరీ సెషన్‌. 
-    ఈ సెషన్లో పాల్గోనున్న పలువురు ప్రముఖులు.
-    రెండోరోజునా పలు కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు.
-    ముఖ్యమంత్రి చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుని మొత్తంగా షెడ్యూల్‌ ఖరారు చేసే పనిలో అధికారులు. 

ఈ సమావేశంలో పాల్గొన్న పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్‌ కరికాల వలవెన్‌, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్‌ ఎస్‌ ఎస్ రావత్‌, సమాచారశాఖ కమిషనర్ టి విజయ్‌కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top