విద్యారంగ సంస్క‌ర‌ణల‌ అమ‌లుపై సీఎం స‌మీక్ష‌

తాడేప‌ల్లి: విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణల అమలుపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధ్య‌క్ష‌త‌న స‌మీక్షా స‌మావేశం ప్రారంభ‌మైంది. నూతన విద్యా విధానం అమలుపైనా సీఎం సమీక్షిస్తున్నారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు  కార్యాలయంలో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ.ఆర్‌ అనురాధ, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ (ఎండిఎం అండ్‌ శానిటేషన్‌) బి.ఎం. దివాన్, మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ కృతికా శుక్లా, సర్వశిక్షా అభయాన్‌ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెట్రిసెల్వి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి. చినవీరభద్రుడు, ఏపీఆర్‌ఈఐఎస్‌ సెక్రటరీ వి. రాములు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

Back to Top