విశాఖ చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌

విశాఖ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ చేరుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో సీఎం వైయస్‌ జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యే, వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి కాన్వాయ్‌లో బయల్దేరిన సీఎం వైయస్‌ జగన్‌ మరికాసేపట్లో కేజీహెచ్‌కు చేరుకోనున్నారు. కేజీహెచ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం వైయస్‌ జగన్‌ పరామర్శిస్తారు. అనంతరం ఎల్‌జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజీ ఘటనపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.  
 

తాజా వీడియోలు

Back to Top