ఉద‌య‌గిరికి బ‌య‌లుదేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి అంత్య‌క్రియ‌ల్లో పాల్గొనేందుకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బ‌య‌లుదేరారు. కొద్దిసేప‌టి క్రితం తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి  సీఎం వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు, వైవీ సుబ్బారెడ్డి చేరుకున్నారు. గన్నవరం నుండి కడప ఎయిర్ పోర్ట్‌కు బయలుదేరుతారు. అక్క‌డి నుంచి నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరిలోని మెరిట్స్‌ కాలేజీలో నిర్వ‌హిస్తున్న మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి అంతిమ సంస్కారంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దంప‌తులు పాల్గొంటారు.  

Back to Top