ఆంధ్ర‌కేస‌రికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఘ‌న నివాళి

తాడేప‌ల్లి: ఆంధ్ర‌రాష్ట్ర తొలి ముఖ్య‌మంత్రి టంగుటూరి ప్ర‌కాశం పంతులు జ‌యంతి సందర్భంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఘ‌న నివాళుల‌ర్పించారు. ప్ర‌కాశం పంతులు కృషిని కొనియాడుతూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. ``స్వాతంత్ర్య సంగ్రామపథంలో తెలుగువారి కీర్తి పతాక ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. స్వాతంత్య్రం అనంతరం ఏర్పడ్డ ఆంధ్రరాష్ట్రానికి తొలిముఖ్యమంత్రిగా.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వారు వేసిన పునాదులు విశేషమైనవి. ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఘన నివాళి`` అర్పిస్తూ సీఎం ట్వీట్ చేశారు. 

Back to Top