జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం
25 Apr 2022 2:31 PM
నీతిఆయోగ్ సదస్సులో పాల్గొన్న సీఎం వైయస్ జగన్
తాడేపల్లి: సహజ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నీతి ఆయోగ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సమీర్ శర్మ, ముఖ్యమంత్రి స్పెషల్ సీఎస్ కె. ఎస్. జవహర్ రెడ్డి, అగ్రికల్చర్ స్పెషల్ కమిషనర్ సీహెచ్. హరి కిరణ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన వాటిని ఆర్బీకే (రైతు భరోసా కేంద్రం)ల ద్వారా అందిస్తున్నామని చెప్పారు. ప్రకృతి వ్యవసాయంపై మరింత పరిశోధన జరగాలని, నేచురల్ వ్యవసాయం కోసం కేంద్రం 90:10 నిష్పత్తిలో నిధులివ్వాలని సూచించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఆర్బీకేలపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ప్రశంసలు కురిపించారు. ఆర్బీకేలు అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు.