నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడే
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం వైయస్ జగన్
25 Dec 2019 11:25 AM
వైయస్ఆర్ జిల్లా: పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. చర్చిలో ప్రత్యేక పార్థనలు నిర్వహించారు. అనంతరం సీఎం వైయస్ జగన్, వైయస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, సీఎం సతీమణి వైయస్ భారతి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వెంట డిప్యూటీ సీఎంలు అంజాద్బాషా, ఆళ్ల నాని, మంత్రులు అవంతి శ్రీనివాస్, ఆదిమూలపు సురేష్, ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వైయస్ విజయమ్మ ప్రసంగించారు. దేవుడి దయ, ప్రజలందరి ఆశీర్వాదంతో ఆనాడు వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యి అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని, ఆయన మరణించినా కోట్లాది మంది ప్రజల గుండెల్లో చిరంజీవిగా ఉన్నారన్నారు. అంతే ప్రేమతో వైయస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకున్నారని, దేవుడు జగన్ బాబు మీద చాలా గొప్ప బాధ్యత పెట్టాడన్నారు. ప్రతి నిత్యం జనం.. జనం అంటూ జనం కోసమే వైయస్ జగన్ ఆలోచనలు చేస్తున్నారన్నారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ను వైయస్ విజయమ్మ, సీఎం వైయస్ జగన్ ఆవిష్కరించారు.