సీఎం సాయం.. చిన్నారికి శస్త్ర చికిత్స

తమ కుమారుడి ప్రాణం కాపాడిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన అన్వర్‌ కుటుంబం 

అమరావతి: పండుగ రోజున ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓ చిన్నారి ప్రాణం కాపాడి ఆ కుటుంబంలో నిజమైన దీపావళి కాంతులు నింపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రానికి చెందిన అన్వర్‌బాషా కుమారుడు దానీష్‌ ఇంట్లో ఆడుకుంటూ వేరుశనగ విత్తనం మింగాడు. అది కాస్తా ఊపిరితిత్తుల్లోకి చేరడంతో శ్వాస ఆడక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్‌ సీఎం వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. 

స్పందించిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిన్నారికి అవసరమైన వైద్యసేవలు అందించాలని హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు. దీంతో అక్కడి వైద్యులు శస్త్రచికిత్స చేసి చిన్నారి ప్రాణాలను కాపాడారు. రూ.2 లక్షలు విడుదల చేసి తన కుమారుడి ప్రాణాలు కాపాడిన సీఎం వైయస్‌ జగన్, ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్‌కు రుణపడి ఉంటామని అన్వర్‌బాషా దంపతులు చెప్పారు.  
 

Back to Top