జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
సీఎం సాయం.. చిన్నారికి శస్త్ర చికిత్స
16 Nov 2020 10:31 AM
తమ కుమారుడి ప్రాణం కాపాడిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన అన్వర్ కుటుంబం
అమరావతి: పండుగ రోజున ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఓ చిన్నారి ప్రాణం కాపాడి ఆ కుటుంబంలో నిజమైన దీపావళి కాంతులు నింపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రానికి చెందిన అన్వర్బాషా కుమారుడు దానీష్ ఇంట్లో ఆడుకుంటూ వేరుశనగ విత్తనం మింగాడు. అది కాస్తా ఊపిరితిత్తుల్లోకి చేరడంతో శ్వాస ఆడక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ సీఎం వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు.
స్పందించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి చిన్నారికి అవసరమైన వైద్యసేవలు అందించాలని హైదరాబాద్లోని యశోదా ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు. దీంతో అక్కడి వైద్యులు శస్త్రచికిత్స చేసి చిన్నారి ప్రాణాలను కాపాడారు. రూ.2 లక్షలు విడుదల చేసి తన కుమారుడి ప్రాణాలు కాపాడిన సీఎం వైయస్ జగన్, ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్కు రుణపడి ఉంటామని అన్వర్బాషా దంపతులు చెప్పారు.