కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం వైయస్‌.జగన్‌ భేటీ 

న్యూఢిల్లీ:  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ భేటీ అయ్యారు. శుక్ర‌వారం సాయంత్రం న్యూఢిల్లీలో దాదాపు 40 నిమిషాలసేపు ఈ స‌మావేశం సాగింది.  రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై  ముఖ్యమంత్రి చ‌ర్చించారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించిన సహాయానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

2014-15కి సంబంధించిన వనరుల గ్యాప్ ఫండింగ్, 2016-2019 మధ్య కాలంలో జరిగిన పరిమితికి మించి రుణాలు కారణంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న పర్యవసానాలు, 2021-22లో రుణాల పరిమితిపై సడలింపులు అంశాన్ని ఆర్థికమంత్రితో చర్చించిన సీఎం. 
 
రాష్ట్రాన్ని విభజించిన తర్వాత తెలంగాణ డిస్కంలకు ఏపీ జెన్‌కో సరఫరాచేసిన విద్యుత్‌, రూ.6,756.92కోట్ల బకాయిల అంశాన్నీ ప్రస్తావించిన ముఖ్యమంత్రి. ఇప్పటికే పలుమార్లు ఈ అంశాన్ని కేంద్ర దృష్టికి తీసుకొచ్చిన అంశాన్నీ గుర్తుచేసిన సీఎం.

 ఏపీ జెన్‌కో ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఈ డబ్బు చాలా అవసరమని, జాప్యం లేకుండా వీలైనంత త్వరగా ఈ డబ్బు ఇప్పించాలని విజ్ఞప్తిచేసిన సీఎం. 

 రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే కేపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మీద కేంద్ర ప్రభుత్వం స్పెషల్‌ అసిస్టెన్స్‌ ఇచ్చేలా బడ్జెట్‌లో పొందుపరిచారని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగాల్లో అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టిందని, స్కూళ్లలో నాడు - నేడు కింద ఇప్పటికే రూ.6వేల కోట్లు ఖర్చుచేసిందని, తొలిదశ కింద 15,717 స్కూళ్లలో నాడు-నేడు కూడా పూర్తయ్యిందని, ఆరోతరగతి నుంచి ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపిన సీఎం. 

అలాగే ఆరోగ్య రంగంలో కూడా నాడు -నేడు కింద అనేక చర్యలు చేపట్టామని, విలేజ్‌ క్లినిక్స్‌ నుంచి టీచింగ్ ఆస్పత్రులవరకూ నాడు -నేడు కింద పనులు చేపట్టామని,చ ఇప్పటికే దీనికోసం రూ.4వేల కోట్లు ఖర్చుచేశామని పేర్కొ్న్న సీఎం.

రాష్ట్ర ప్రభవిష్యత్తును ఈ కార్యక్రమాలు తీర్చిదిద్దుతాయని, వీటికోసం చేసిన ఖర్చును క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించి స్పెషల్‌ అసిస్టెన్స్‌ను వర్తింపు చేయాల్సిందిగా కోరిన ముఖ్యమంత్రి. 
 
రేపు నీతిఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్  పాల్గోనున్నారు.

Back to Top