దాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేన
మనమంతా కలిసికట్టుగా ఒక్కటైతే మంచి విజయాలు
13 Oct 2022 5:42 PM
ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం వైయస్ జగన్ భేటీ
తాడేపల్లి: మనం అంతా కలిసికట్టుగా ఒక్కటి కావాలి. అప్పుడే మంచి విజయాలు నమోదు చేస్తామని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలతో తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆలూరు నుంచి వచ్చిన కార్యకర్తలను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గంలోని కార్యకర్తలను కలుసుకోవాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశం. ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
‘‘ గడపగడపకూ కార్యక్రమాన్ని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో చేపడుతున్నాం. ఎమ్మెల్యేలు సంబంధిత నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. గ్రామంలో ప్రతి ఇంటికీ వెళ్తున్నారు. ఈ మూడేళ్ల కాలంలో మనం చేసిన మంచి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్తున్నాం, ఆ కుటుంబానికి జరిగిన మేలును వివరిస్తున్నాం. ఆ మేలు జరిగిందా? లేదా? అనే విచారణ చేస్తున్నాం. వారి ఆశీస్సులు తీసుకుంటున్నాం. ప్రభుత్వంలో ఉన్న మనం అంతా.. గ్రామస్థాయిల్లో కూడా వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్నామని’’ సీఎం అన్నారు.
అలాగే ప్రతి సచివాలయానికీ రూ.20లక్షల రూపాయలు ప్రాధాన్యతా పనుల కోసం కేటాయిస్తున్నాం. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా గ్రామంలో 2 రోజులపాటు కచ్చితంగా ఎమ్మెల్యే గడపుతున్నారు. రోజూ 6 గంటలపాటు సమయం మీ మధ్యే గడుపుతున్నారు. సీఎంగా నేను ప్రతి కార్యకర్తకూ అందుబాటులో ఉండలేకపోవచ్చు. సాధ్యం కాదుకూడా. కాకపోతే ప్రతి ఎమ్మెల్యే కార్యకర్తకూ అందుబాటులో ఉండాలి. ఎమ్మెల్యేలు మాత్రం ప్రతి గ్రామంలో తిరగాలి.. రోజుకు 6 గంటలు గడపాలి. సాధకబాధకాలు తెలుసుకుని.. వాటిని పరిష్కరించే ప్రయత్నం గడపగడపకూ కార్యక్రమం ద్వారా కొనసాగుతుంది’’ అని సీఎం వైయస్ జగన్ పేర్కొన్నారు.
దేవుడి దయవల్ల గడపగడపకూ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. ఈ మధ్యలో వీలైనప్పుడు నేను ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసంగా 100 మంది కార్యకర్తలను కలుస్తున్నాను. ఒక్క ఆలూరు నియోజకవర్గానికే వివిధ పథకాల ద్వారా ఈ మూడు ఏళ్ల కాలంలో రూ.1050 కోట్లు నేరుగా లబ్ధిదారుల ప్రత్యక్ష నగదు బదిలీద్వారా నేరుగా వారి ఖాతాల్లో వేయడం జరిగిందని సీఎం వైయస్ జగన్ అన్నారు