రాష్ట్రాభివృద్ధి అజెండాగా ప్రధానితో సీఎం వైయ‌స్ జగన్ భేటీ 

విభ‌జ‌న హామీలు, తాజా ప‌రిస్థితుల‌పై చ‌ర్చ‌

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  కొద్దిసేప‌టి క్రిత‌మే సమావేశం అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి అజెండాగా ఈ భేటీ జరిగింది. రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సహాయం, చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్ర విభజన హామీలు, తదితర 17 అంశాలపై ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి  నివేదించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

ప్రధాని మోదీతో భేటీ అనంతరం కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్  అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి జల వివాదాల పరిష్కారానికి వీలుగా కేంద్ర జల శక్తి శాఖ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
 

Back to Top