13న సీఎం వైయ‌స్‌ జగన్‌ చేతుల మీదుగా ఎంఐజీ లేఅవుట్‌ ప్రారంభం  

 అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ సమీపంలో మధ్య ఆదాయ వర్గాల వారి కోసం అందుబాటులోకి తెచ్చిన జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లోని ఎంఐజీ లే అవుట్‌ను ఈ నెల 13న సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ఏపీ సీఆర్డీఏ కమిషనర్‌ విజయకృష్ణన్ ఓ ప్రకటనలో తెలిపారు. 200 నుంచి 240 చదరపు అడుగుల వైశాల్యంలో ఉన్న ఈ ప్లాట్లను పొందేందుకు రూ.18 లక్షల లోపు వార్షిక ఆదాయమున్న ఏపీకి చెందిన వారు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు సీఆర్డీఏ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. 

తాజా వీడియోలు

Back to Top