రాష్ట్ర ప్ర‌జ‌లకు మ‌హా శివ‌రాత్రి శుభాకాంక్ష‌లు

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ మ‌హాశివ‌రాత్రి శుభాకాంక్ష‌లు తెలిపారు. శివ‌రాత్రి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. `ప‌ర‌మేశ్వ‌రుడిని అత్యంత భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పూజించే అతిపెద్ద పండుగ మ‌హాశివ‌రాత్రి. ఈ ప‌ర‌మ ప‌విత్ర‌మైన రోజున‌ ముక్కంటి క‌రుణాక‌టాక్షాలు రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రిపై ఉండాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ అంద‌రికీ మ‌హాశివ‌రాత్రి శుభాకాంక్ష‌లు` తెలుపుతూ సీఎం ట్వీట్ చేశారు. 

Back to Top