రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
శ్రీకాకుళం బయల్దేరిన సీఎం వైయస్ జగన్
09 Nov 2021 11:44 AM
తాడేపల్లి: ఒడిశా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కొద్దిసేపటి క్రితమే తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. తొలుత శ్రీకాకుళం జిల్లా పాతపట్నం చేరుకుని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. శ్రీకాకుళం పర్యటన అనంతరం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్కు బయల్దేరనున్నారు. సాయంత్రం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నివాసానికి చేరుకొని.. రెండు రాష్ట్రాలకు సంబంధించిన పెండింగ్ అంశాలపై ఇరు ముఖ్యమంత్రులు చర్చిస్తారు. రాత్రి అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లిలోని తన నివాసానికి సీఎం వైయస్ జగన్ చేరుకుంటారు.