ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తిరుమ‌ల‌: శ్రీ‌వారి భ‌క్తుల సౌక‌ర్యార్థం ఏర్పాటు చేసిన ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రారంభించారు. శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామిని ద‌ర్శించుకునేందుకు తిరుమ‌ల కొండ‌కు వ‌చ్చే భ‌క్తుల కోసం టీటీడీ ఏర్పాటు చేసిన ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను అలిపిరి వ‌ద్ద సీఎం వైయ‌స్ జ‌గ‌న్ జెండా ఊపి ప్రారంభించారు. అధునాతన సౌకర్యాలతో భక్తులకు ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. మ‌రి కాసేప‌ట్లో శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొంటారు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామికి ప‌ట్టువ‌స్త్రాల‌ను స‌మ‌ర్పించ‌నున్నారు. 

Back to Top