చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
రాయచోటిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
24 Dec 2019 2:27 PM
వైయస్ఆర్ జిల్లా: రాయచోటి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపనలు చేశారు. సాగునీరు, తాగునీరు, మైనార్టీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టల్స్, పాలిటెక్నిక్ కాలేజీ, పోలీస్ కార్యాలయాలు, రైతులకు సంబంధించి భూసార పరీక్షా కేంద్రాలకు, మున్సిపల్లో పలు అభివృద్ధి వంటి పనులకు సీఎం వైయస్ జగన్ శంకుస్థాపనలు చేశారు. రూ.1272 కోట్లతో గాలేరు – నగరి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్, వెలిగళ్లు లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు, రూ.1.50 కోట్లతో శ్రీవీరభద్రస్వామి ఆలయ ఐదు అంతస్థుల రాజగోపురం ముఖ ద్వారాలు. రాయచోటి ఏరియా ఆస్పత్రి 100 పడకలుగా అప్గ్రేడ్. ఆస్పత్రిలో రూ.23 కోట్లతో నూతన భవనాల నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేశారు. అదే విధంగా ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్, మైనార్టీ ఐటీఐతో పాటు రూ.10 కోట్లతో పాలిటెక్నిక్ కళాశాల, 18 కోట్లతో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, రూ.12 కోట్లతో సోషల్ మైనార్టీ రెసిడెన్షియల్ బాలుర వసతి గృహ నిర్మాణాలకు సీఎం శంకుస్థాపనలు చేశారు. అంతేకాకుండా రూ.6.60 కోట్లతో రాయచోటి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు. రూ.340.60 కోట్లతో రాయచోటి పట్టణంలో భూగర్భ డ్రైనేజీ, రూ.98 కోట్లతో తాగునీటి సరఫరా, రూ.3 కోట్లతో అధునాతన భూసార పరీక్షా కేంద్రం, రూ.58 లక్షలతో ఎంపీడీఓ కార్యాలయానికి నూతన భవనాలు, 33 గ్రామ సచివాలయ భవన నిర్మాణాలకు, రాయచోటి నియోజకవర్గంలో మొత్తం మీద రూ. 1902.09 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.