నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడే
కరోనా పరీక్షల సంఖ్య పెంచండి
26 Apr 2020 2:04 PM
ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం వైయస్ జగన్ ఆదేశాలు
తాడేపల్లి : కరోనా (కోవిడ్-19) పరీక్షల సంఖ్య మరింతగా పెంచాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్–19 నివారణ చర్యలతో పాటు, వైరస్ వ్యాప్తిని నియంత్రణపై ఆదివారం ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉన్నతాస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రతి జిల్లాలోనూ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటుకు చర్యలు ముమ్మరం చేయాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. అలాగే రెడ్ జోన్లులో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, హెల్త్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.