వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు సీఎం తీపికబురు
23 Dec 2022 2:54 PM
వయోపరిమితి రెండేళ్లు పెంపు
అమరావతి: కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు సంబంధించి ముఖ్యమంత్రి వైయస్.జగన్ సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉద్యోగార్థుల విజ్ఞప్తిమేరకు వయో పరిమితిని రెండేళ్లపాటు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంవల్ల చాలామంది ఈ ఉద్యోగాలకోసం పోటీపడేందుకు అవకాశం లభిస్తోంది. పలు పోలీసు ఉద్యోగాల భర్తీచేయాలంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలమేరకు వీటి భర్తీకోసం పోలీస్శాఖ అక్టోబరు 20న నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులో 6,100 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి(మరో 411 ఎస్పై పోస్టులుకూడా నోటిఫికేషన్లో ఉన్నాయి). వయోపరితిని పెంచి తమకు కూడా అర్హత కల్పించాలంటూ కానిస్టేబుల్ ఉద్యోగార్థులు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులపై సీఎం అధికారులతో సమావేశమయ్యారు. వారికి అవకాశం కల్పించేలా రెండేళ్లపాటు వయోపరిమితి పెంచుతూ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.