పవన్‌ అభిమానికి సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆర్థిక సాయం

తాడేపల్లి:  కులం, మ‌తం, ప్రాంతం, పార్టీలు చూడ‌మ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌ద‌వీ ప్ర‌మాణ స్వీకారం చేసిన రోజే పేర్కొన్నారు. ఈ విష‌యం మ‌రోమారు రుజువైంది. జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌, 
 పవన్‌కల్యాణ్ అభిమానికి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.10 లక్షలు మంజూరు చేశారు. పవన్ కల్యాణ్ అభిమాని నాగేంద్ర రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని, అతనికి అత్యవసర చికిత్స చేయాలంటూ ఓ స్వచ్ఛంద సంస్థ ట్వీట్ చేసింది. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఈ విషయాన్ని విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సీఎం వైయ‌స్ జగన్ పవన్ అభిమానికి రూ.10లక్షలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎంవో స్పెషల్ ఆఫీసర్‌ డాక్టర్ హరికృష్ణ ఆస్పత్రికి ఎల్‌వోసీ అందజేశారు. ప్రభుత్వ సాయంతో పవన్ అభిమాని నాగేంద్రకు స్టెమ్ సెల్ థెరపి జరిగింది. అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సీఎంవో అధికారులు పేర్కొన్నారు.

Back to Top