తెలుగు ప్రజలకు సీఎం వైయ‌స్ జగన్‌ దీపావళి శుభాకాంక్షలు

తాడేప‌ల్లి: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చీకటిపై ‘వెలుగు’.. చెడుపై ‘మంచి’.. అజ్ఞానంపై ‘జ్ఞానం’.. దుష్ట శక్తులపై ‘దైవశక్తి’.. సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆనంద కాంతులు నింపాలని ఆకాంక్షించారు. 
ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, దివ్వెల వెలుగుల‌లో ప్ర‌తి కుటుంబం సుఖ‌సంతోషాల‌తో విరాజిల్లాల‌ని సీఎం అభిలషించారు.

దీపావళి అంటే దీపాల వరస...
దుష్ట రాక్షస శిక్షణ చేసే దైవ శక్తి, 
దుర్మార్గం మీద ఉగ్రతాండవం చేసే స్త్రీ శక్తి, 
మోగించిన విజయ దుందుభికి ప్రతీక...
మనం నేడు వెలిగించే... ఆ దీపాల వరస! 
చీకట్లను చీల్చే వెలుగుల పండగ సందర్భంగా 
రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు!

Back to Top