శాస‌న‌మండ‌లి చ‌రిత్ర‌లోనే మొట్ట‌ మొద‌టిసారి..

సోద‌రి జకియా ఖానంకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అభినంద‌న‌లు

తాడేప‌ల్లి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర శాసనమండలి చరిత్రలోనే మొట్ట మొదటిసారి ఓ మైనారిటీ మహిళను డిప్యూటీ చైర్ పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషంగా ఉందని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. మండ‌లి డిప్యూటీ చైర్ ప‌ర్స‌న్‌గా ఎన్నికైన సోదరి జకియా ఖానంకు సీఎం అభినందనలు తెలిపారు. అక్క, చెల్లెమ్మలకు అండగా నిలిచి, మహిళా సాధికారత దిశగా ఈ ప్రభుత్వం వేసిన మరో ముందడుగు ఇది అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. 

Back to Top