రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
రాష్ట్రవ్యాప్తంగా సీఎం వైయస్ జగన్ జన్మదిన వేడుకలు
21 Dec 2022 4:14 PM
అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో భారీ కేక్లు కట్ చేశారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తాన్ని సేకరించారు. అలాగే పలు సేవా కార్యక్రమాలు చేపట్టి ఆదర్శంగా నిలిచారు. పుట్టిన రోజును పురస్కరించుకుని బుధవారం రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటడంతోపాటు అన్నదానం, వస్త్రదానాలు చేస్తున్నారు. అలాగే ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేపట్టారు.
రెడ్క్రాస్ సంస్థతో కలిసి రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజుకు సంబంధించి మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహించాలని ఇంతకుముందే వైఎస్సార్సీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
అనంతపురం:
రాప్తాడులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మెగా రక్తదాన శిబిరం ప్రారంభించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, అహుడా ఛైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్, జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ పాల్గొన్నారు.
అనకాపల్లి జిల్లా:
మాడుగుల మండలం ఎ.కోడూరులో సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు మొక్కలు నాటారు. సీఎం జగన్ ప్రజా నాయకుడు అని, ప్రజల ఆకాంక్ష మేరకు పాలన అందిస్తున్నారన్నారు.
వృద్ధులకు దుస్తుల పంపిణీ
శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మండలం ఎస్ఆర్బీసీ కాలనీలో ఏర్పాటైన వృద్ధాశ్రమంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తనయుడు, వైయస్ఆర్సీపీ యూత్ నాయకుడు శిల్పా కార్తీక్ రెడ్డి వృద్ధులకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు. అంతకు ముందు పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి సీఎం వైయస్ జగన్కు శుభాకాంక్షలు తెలిపారు.
నెల్లూరు కార్యాలయంలో..
నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కేక్ కట్ చేశారు. అనంతరం ధన లక్ష్మీపురంలో రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు.
కృష్ణా జిల్లా :
పెడన నియోజకవర్గం వైఎస్సార్సీపీ కార్యాలయంలో సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మంత్రి జోగి రమేష్ రక్త దానం చేశారు.
ప్రకాశం జిల్లా:
సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలను ఒంగోలు నగరంలోని 34 వార్డులో కార్పొరేటర్ డాకా సుజాత, హనుమారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా
సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు నెల్లూరు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. చెముడుగుంటలో కేక్ కట్ చేసిన మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి.. సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అన్ని వర్గాల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని అన్నారు. ఆయన శాశ్వత సీఎంగా ఉండాలని కోరుకుంటున్నానని మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి అన్నారు.
పల్నాడు జిల్లాలో
పల్నాడు జిల్లా దాచేపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయంలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కోట కృష్ణ, ఎంపీపీ బ్రహ్మనాయుడు, జెడ్పీటీసీ ప్రకాష్రెడ్డి, రమేష్రెడ్డి, కొణతం సూర్య నారాయణ రెడ్డి పాల్గొన్నారు.
గోదావరి జిల్లాల్లో..
గోదావరి జిల్లాల్లో సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజును ఘనంగా నిర్వహిస్తున్నారు. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న సీఎం జన్మదిన సందర్భంగా అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, నియోజకవర్గంలో నాలుగు మండలాల పరిధిలో మహిళలకు ఇప్పటికీ ముగ్గులు పోటీలు నిర్వహించామని విజేతలకు బహుమతులు అందిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నామని జగ్గిరెడ్డి అన్నారు.
విశాఖపట్నంలో..
విశాఖ నగర వైఎస్సార్సీపీ కార్యాలయంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. పార్టీ నేతలు కేక్ కట్ చేసి సీఎం జగన్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.
తిరుపతిలో..
వైఎస్సార్ విగ్రహం సర్కిల్ వద్ద సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కేక్ కట్ చేశారు. మేయర్ డాక్టర్ శిరీష, తిరుపతి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, డిప్యూటీ మేయర్లు, భూమన అభినయ్ రెడ్డి, ముద్ర నారాయణ, కార్పొరేటర్లు పాల్గొన్నారు. తిరుపతి ఇందిరా మైదానంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు.
అనంతపురం జిల్లాలో..
సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు అనంతపురం జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి. అనంతపురం కేఎస్ఆర్ కళాశాలలో విద్యార్థులు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జగన్ మామయ్య అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అమ్మ ఒడి, నాడు- నేడు వంటి పథకాలతో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న వైఎస్ జగన్కు అంతా మంచే జరగాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.
కృతజ్ఞత చాటుకుంటున్న ప్రజలు..
దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98 శాతం సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే నెరవేర్చారు. మూడున్నరేళ్లుగా వివిధ సంక్షేమ పథకాల కింద లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ (డీబీటీ) రూపంలో రూ.1,77,585.51 కోట్లను జమ చేశారు. అలాగే ఇళ్ల స్థలాలు, ఆరోగ్యశ్రీ తదితర పథకాల ద్వారా నాన్ డీబీటీ రూపంలో రూ.1,41,642.35 కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి ఇప్పటివరకు రూ.3,19,227.86 కోట్లను అందించారు.
వివిధ సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా సగటున 89 శాతం కుటుంబాలకు లబ్ధి చేకూర్చారు. దీంతో లబ్ధిదారులు గత రెండు రోజులుగా జరుగుతున్న సీఎం జన్మదిన వేడుకల్లో భారీగా పాల్గొంటున్నారు. తద్వారా సీఎం వైఎస్ జగన్కు తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సోమవారం నిర్వహించిన క్రీడల పోటీల్లోనూ.. మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమంలోనూ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనడమే ఇందుకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.