రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ఊరూవాడా సీఎం వైయస్ జగన్ జన్మదిన వేడుకలు
21 Dec 2022 11:31 AM
అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఊరూవాడాలో ఘనంగా నిర్వహిస్తున్నారు. మూడు రోజులుగా పుట్టిన రోజు వేడుకలను వైయస్ఆర్సీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 19న క్రీడా పోటీలు, 20న మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టగా, 21వ తేదీన వైయస్ఆర్ విగ్రహాలకు పాలాభిషేకం, కేక్ కటింగ్, రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, దుస్తుల పంపిణీ, పుస్తకాల పంపిణీ కార్యక్రమాలు చేపడుతున్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. విజయవాడ నగర శివారులోని వారధికి ఇరువైపు వైయస్ జగన్ ప్లేక్సీలు ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలిపారు.
గోదావరి జిల్లాలో:
గోదావరి జిల్లాల్లో సీఎం వైయస్ జగన్ పుట్టినరోజును ఘనంగా నిర్వహిస్తున్నారు. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న సీఎం జన్మదిన సందర్భంగా అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, నియోజకవర్గంలో నాలుగు మండలాల పరిధిలో మహిళలకు ఇప్పటికీ ముగ్గులు పోటీలు నిర్వహించామని విజేతలకు బహుమతులు అందిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. సీఎం వైయస్ జగన్ ఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నామని జగ్గిరెడ్డి అన్నారు.
విశాఖపట్నంలో..
విశాఖ నగర వైయస్ఆర్సీపీ కార్యాలయంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. పార్టీ నేతలు కేక్ కట్ చేసి సీఎం జగన్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.
తిరుపతిలో..
వైయస్ఆర్ విగ్రహం సర్కిల్ వద్ద సీఎం వైయస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కేక్ కట్ చేశారు. మేయర్ డాక్టర్ శిరీష, తిరుపతి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, డిప్యూటీ మేయర్లు, భూమన అభినయ్ రెడ్డి, ముద్ర నారాయణ, కార్పొరేటర్లు పాల్గొన్నారు. తిరుపతి ఇందిరా మైదానంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు.
అనంతపురం జిల్లాలో..
సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు అనంతపురం జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి. అనంతపురం కేఎస్ఆర్ కళాశాలలో విద్యార్థులు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జగన్ మామయ్య అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అమ్మ ఒడి, నాడు- నేడు వంటి పథకాలతో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న వైఎస్ జగన్కు అంతా మంచే జరగాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.
సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని బుధవారం రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటడంతోపాటు అన్నదానం, వస్త్రదానాలు చేస్తున్నారు. అలాగే ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేపట్టారు.
రెడ్క్రాస్ సంస్థతో కలిసి రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజుకు సంబంధించి మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహించాలని ఇంతకుముందే వైఎస్సార్సీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
కృతజ్ఞత చాటుకుంటున్న ప్రజలు..
దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98 శాతం సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే నెరవేర్చారు. మూడున్నరేళ్లుగా వివిధ సంక్షేమ పథకాల కింద లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ (డీబీటీ) రూపంలో రూ.1,77,585.51 కోట్లను జమ చేశారు. అలాగే ఇళ్ల స్థలాలు, ఆరోగ్యశ్రీ తదితర పథకాల ద్వారా నాన్ డీబీటీ రూపంలో రూ.1,41,642.35 కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి ఇప్పటివరకు రూ.3,19,227.86 కోట్లను అందించారు.
వివిధ సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా సగటున 89 శాతం కుటుంబాలకు లబ్ధి చేకూర్చారు. దీంతో లబ్ధిదారులు గత రెండు రోజులుగా జరుగుతున్న సీఎం జన్మదిన వేడుకల్లో భారీగా పాల్గొంటున్నారు. తద్వారా సీఎం వైఎస్ జగన్కు తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సోమవారం నిర్వహించిన క్రీడల పోటీల్లోనూ.. మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమంలోనూ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనడమే ఇందుకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.