నూత‌న వ‌ధూవ‌రుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆశీర్వాదం

శ్రీ‌కాకుళం: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి శ్రీ‌కాకుళం జిల్లా పాత‌ప‌ట్నం చేరుకున్నారు. పాత‌ప‌ట్నంలో వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహా రిసెప్షన్‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా నూత‌న వ‌ధూవ‌రులు రెడ్డి వేదిత (ఐఏఎస్‌), వరుడు రుచిత్‌ రల్లిలను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆశీర్వ‌దించారు. ముఖ్య‌మంత్రి వెంట స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం, మంత్రులు ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌, సీదిరి అప్ప‌ల‌రాజు, ఎమ్మెల్యేలు ఉన్నారు.

Back to Top