గవర్నర్‌ విందుకు హాజరైన సీఎం వైయస్ జగన్

విజ‌య‌వాడ‌:  రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత రాష్ట్రపతి  ద్రౌపతి ముర్ముతొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. రాష్ట్రపతి  ద్రౌపతి ముర్ము గౌరవార్ధం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ శ్రీ బిశ్వభూషణ్‌ హరిచందన్ అధికారిక విందు ఏర్పాటు చేశారు. గవర్నర్‌ విందుకు  ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్ మోహ‌న్ రెడ్డి, వైయ‌స్ భార‌తి, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ కిషన్‌ రెడ్డి,ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు.

Back to Top