కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
ఏలూరు చేరుకున్న సీఎం వైయస్ జగన్
04 Nov 2020 11:09 AM
కాసేపట్లో తమ్మిలేరు రిటైనింగ్ వాల్ పనులకు శంకుస్థాపన
పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఏలూరు చేరుకున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల నేపథ్యంలో హెలికాప్టర్లో ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంకు చేరుకున్న సీఎం వైయస్ జగన్కు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు తానేటి వనిత, శ్రీరంగనాథరాజు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు. కాసేపట్లో తమ్మిలేరు కాల్వ రిటైనింగ్ వాల్కు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రూ.330 కోట్ల నిధులతో నగరంలో చేపట్టే పలు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను సీఎం వైయస్ జగన్ ప్రారంభించనున్నారు. అనంతరం ఏలూరు నగరంలోని శ్రీసూర్య కన్వెన్షన్ హాల్లో ఎస్ఎంఆర్ పెదబాబు, నూర్జహాన్ల కుమార్తె వివాహానికి హాజరవుతారు.