రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ఢిల్లీ చేరుకున్న సీఎం వైయస్ జగన్
10 Jun 2021 1:26 PM
ఢిల్లీ: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఉదయం గన్నవరం ఎయిర్పోర్టు నుంచి బయల్దేరిన సీఎం కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్టులో ముఖ్యమంత్రి వైయస్ జగన్కు వైయస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకట రమణ స్వాగతం పలికారు. సీఎం వెంట ఎంపీలు మిథున్రెడ్డి, వైయస్ అవినాష్రెడ్డి, బాలశౌరి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రహోంశాఖ మంత్రి అమిత్షా, జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, రైల్వే శాఖ మంత్రి గోయల్ సహా పలువురు కేంద్ర మంత్రులను సీఎం వైయస్ జగన్ కలుసుకుంటారు. పోలవరం ప్రాజెక్టు పనులు సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చిస్తారు. తిరిగి శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.