వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
గుజరాత్లో చిక్కుకున్న మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ.2 వేల సాయం
22 Apr 2020 5:10 PM
తాడేపల్లి: గుజరాత్లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారులు ఒక్కొక్కరికి రూ. 2 వేల చొప్పున ఆర్థికసాయం అందజేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సుమారు ఆరు వేల మంది మత్స్యకారులకు ఈ డబ్బు అందేలా అక్కడి అధికారులతో సంప్రదింపులు జరగాలని సీఎం సూచించారు. గుజరాత్లో చిక్కుకున్న మత్స్యకారులకు భోజనం, వసతి సదుపాయాలు కల్పించాలని గుజరాత్ సీఎం విజయ్రూపానీకి ఫోన్ చేసి మాట్లాడానని, అక్కడి ప్రభుత్వం కొన్ని రకాల చర్యలు తీసుకుందన్నారు. మత్స్యకారులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వారికి తగిన వసతి, సదుపాయాలు అందేలా చూడాలని సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.