మత్స్యకార కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాం

కడలి పుత్రులందరికీ శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 
 

తాడేప‌ల్లి: మ‌త్స్య‌కార కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపామ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా కడలి పుత్రులందరికీ శుభాకాంక్షలు. సంక్షేమ పథకాలతో మత్స్యకార కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాం. వారి సంక్షేమ‌మే ల‌క్ష్యంగా అడుగులు వేస్తున్నాం. నేడు న‌ర‌సాపురంలో అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టాం అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
 

Back to Top