కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
మరింత సౌలభ్యంగా పన్ను చెల్లింపుల ప్రక్రియ
14 Nov 2022 3:45 PM
ఆదాయాలను ఇచ్చే శాఖలపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష
బెల్టుషాపులు తొలగించడం, పర్మిట్ రూమ్లు రద్దు చేయడతో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి
అక్రమ మద్యం తయారీ, అమ్మకాలపై ఎస్ఈబీ ప్రత్యేక దృష్టి సారించాలన్న ముఖ్యమంత్రి.
చేయూత, ఆసరా వంటి కార్యక్రమాలు ద్వారా వారికి ఊతమివ్వాలన్న సీఎం.
సబ్రిజిస్ట్రార్ కార్యాలయాను అప్గ్రేడ్ చేయాలన్న సీఎం.
నాన్ ఆపరేషనల్ మైన్స్పై మరింత దృష్టి పెట్టాలన్న సీఎం.
తాడేపల్లి: పన్ను చెల్లింపుదారులకు చెల్లింపుల ప్రక్రియను మరింత సౌలభ్యంగా చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. అవగాహన పెంచడం, వారి అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. దీనివల్ల చెల్లింపులు సకాలంలో జరుగుతాయని, పన్ను కట్టేవారికి కూడా చక్కటి సేవలు అందించినట్టు అవుతుందన్నారు. బెల్టుషాపులు తొలగించడం, పర్మిట్ రూమ్లు రద్దు వంటి ప్రభుత్వం తీసుకున్న వివిధ రకాల నియంత్రణ చర్యల వల్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయని అధికారులు సీఎం వైయస్ జగన్కు వివరించారు. సోమవారం ఆదాయాలను ఇచ్చే శాఖలపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు.
వాణిజ్య పన్నులశాఖ అధికారులతో సీఎం సమీక్ష.
- వాణిజ్య పన్నులశాఖ అధికారులు పన్ను చెల్లింపుదారులకు మరింత అవగాహన కలిగించాలన్న సీఎం.
- ఏపీలో అన్ని రంగాల్లో స్నేహపూర్వక వాతావరణం ఉందన్న విషయాన్ని స్పష్టం చేయాలన్న సీఎం.
- అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న సీఎం.
- అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.
- పన్ను చెల్లింపుదారులకు చెల్లింపుల ప్రక్రియను మరింత సౌలభ్యంగా చేయాలన్న సీఎం.
- అవగాహన పెంచడం, వారి అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్న సీఎం.
- దీనివల్ల చెల్లింపులు సకాలంలో జరుగుతాయని, పన్ను కట్టేవారికి కూడా చక్కటి సేవలు అందించినట్టు అవుతుందన్న సీఎం.
- ట్రేడ్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహించాలని ఆదేశం.
ఎక్సైజ్ శాఖపైనా సమీక్ష.
- గతంతో పోల్చి చూస్తే... మద్యం అమ్మకాలు తగ్గాయి.
- బెల్టుషాపులు తొలగించడం, పర్మిట్ రూమ్లు రద్దు వంటి ప్రభుత్వం తీసుకున్న వివిధ రకాల నియంత్రణ చర్యల వల్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయన్న సీఎం.
- రేట్లు పెంచడం వల్ల కూడా మద్యం వినియోగం తగ్గిందన్న సీఎం.
- అక్రమ మద్యం తయారీ, అమ్మకాలపై ఎస్ఈబీ ప్రత్యేక దృష్టి సారించాలన్న ముఖ్యమంత్రి.
- అక్రమంగా జరుగుతున్న రవాణాపై ప్రత్యేక దృష్టి సారించామన్న అధికారులు.
- వాటిని నివారించడానికి తనిఖీలు ముమ్మరం చేస్తున్నామన్న అధికారులు.
- ఎస్ఈబీలో పరివర్తన కార్యక్రమం జరుగుతున్న తీరుపై వివరాలు తెలుసుకున్న సీఎం.
- పరివర్తన కార్యక్రమంలో చేపడుతున్న కార్యక్రమాలపై ఆరా తీసిన సీఎం.
- చేయూత, ఆసరా వంటి కార్యక్రమాలు ద్వారా వారికి ఊతమివ్వాలన్న సీఎం.
- ప్రత్యామ్నాయ జీవనోపాధిని కల్పించాలన్న సీఎం.
- దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం.
- వారికి ఆదాయాలు వచ్చే దిశగా ఉపాధి ఉండాలన్న సీఎం.
- అప్పుడే మరలా అక్రమ మద్యం తయారీ వంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటారన్న సీఎం.
- గంజాయి, అక్రమ మద్యం కేసులుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం.
- ఏజెన్సీలో గంజాయి నివారణ చర్యలు చేస్తూనే... అక్కడ కూడా ఉపాధి మార్గాలు కల్పించాలన్న సీఎం.
- వారికి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్నాయో లేదో తనిఖీ చేసుకుని లేకపోతే అర్హులైన వారికి పట్టాలివ్వాలన్న సీఎం.
- తద్వారా పట్టాలు వచ్చిన రైతులకు రైతు భరోసా కూడా లభిస్తుందన్న సీఎం.
- వారికి విత్తనాలు, ఎరువులు అందించే కార్యక్రమాలు కూడా చేపట్టాలన్న సీఎం.
- అప్పుడే ఆశించిన స్ధాయిలో మార్పు వస్తుందని... తద్వారా అక్రమ మద్యం, గంజాయి సాగుల నుంచి దూరమవుతారన్న సీఎం.
రిజిస్ట్రేషన్ శాఖపైనా సీఎం సమీక్ష.
- శాశ్వత భూహక్కు, భూసర్వే కార్యక్రమం చేపడుతున్న గ్రామాల్లో.. వార్డుల్లో...సబ్ రిజిస్ట్రార్ భవనం, సేవలు వంటి వాటిపై అవగాహన కలిగించాలన్న సీఎం.
- గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఈ దిశగా ఓరియెంటేషన్ అందించాలన్న సీఎం.
- గ్రామ వార్డు సచివాలయాల పరిధిలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో...ఏయే రకాల డాక్యుమెంట్లును రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్న విషయాలపై ప్రజలకూ అర్ధమయ్యేలా వివరించాలన్న సీఎం.
- సబ్రిజిస్ట్రార్ కార్యాలయాను అప్గ్రేడ్ చేయాలన్న సీఎం.
మైనింగ్ శాఖపై సమీక్ష.
- నాన్ ఆపరేషనల్ మైన్స్పై మరింత దృష్టి పెట్టాలన్న సీఎం.
- నిరుపయోగంగా ఉన్న మైనింగ్ ఏరియాలో కార్యకలాపాలు మొదలయ్యేలా చూడాలన్న సీఎం.
ఈ సమీక్షా సమావేశంలో విద్యుత్, అటవీ పర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషల్ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్, స్టేట్ టాక్సెస్ చీప్ కమిషనర్ గిరిజా శంకర్, సీఐడీ ఏడీజీ పి వి సునీల్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు