వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
శత్రుచర్ల పరిక్షిత్రాజును పరామర్శించిన సీఎం వైయస్ జగన్
02 May 2022 11:40 AM
అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పరిక్షిత్రాజును ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. ఆదివారం పరిక్షిత్ రాజుతో సీఎం వైయస్ జగన్ ఫోన్లో మాట్లాడారు. పరిక్షిత్ తండ్రి చంద్రశేఖర్ రాజు మరణం పట్ల సీఎం వైయస్ జగన్ సంతాపం తెలిపారు.
కాగా, పరిక్షిత్ రాజు తండ్రి.. మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మామ, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు శుక్రవారం కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మూడురోజుల నుంచి విశాఖపట్నంలో ఉంటూ వైద్యసేవలు పొందుతున్నారు. శుక్రవారం ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబీకులు ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే ప్రాణాలు విడిచారు.