నేడు గుంటూరు జిల్లాలో సీఎం వైయ‌స్‌ జగన్‌ పర్యటన

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం గుంటూరు జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఉదయం 10.15 గంటలకు మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో అక్షయపాత్ర సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభించ‌నున్నారు. 11 గంటలకు తాడేపల్లి మండలం కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రం భూమిపూజ చేస్తారు. ఇస్కాన్‌ (బెంగళూరు)కు చెందిన హరేకృష్ణ మూమెంట్‌ ఇండియా ఆద్వర్యంలో నిర్మాణం, ఆరున్నర ఎకరాలలో జాతీయ రహదారి పక్కన కొలనుకొండలో హరేకృష్ణ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తోంది.  

Back to Top