రాష్ట్రం ఎల్లవేళలా సుభిక్షంగా ఉండాలి

రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్  వినాయక చవితి శుభాకాంక్షలు  
 

 తాడేప‌ల్లి: ఆ గణేషుని ఆశీస్సులతో రాష్ట్రం ఎల్లవేళలా సుభిక్షంగా ఉండాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.  ‘విద్య, విజ్ఞానం, వినయ ప్రదాత వినాయకుడు. విఘ్నాలను తొలగించి సకల అభిష్టాలను సిద్ధింపజేసే ఆదిపూజ్యుడు విఘ్నేశ్వరుడు. ఆ గణేషుని ఆశీస్సులతో రాష్ట్రం ఎల్లవేళలా సుభిక్షంగా ఉండాలని, కరోనాకష్టం తొలగిపోయి అంతటా సుఖసంతోషాలు నిండాలని ప్రార్ధిస్తూ.. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు’  అని సీఎం వైయ‌స్ జగన్‌ ట్వీట్‌ చేశారు. 

తాజా వీడియోలు

Back to Top